SAKSHITHA NEWS

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గాయత్రి హోమం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

గాజులరామారం: పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటుచేసిన గాయత్రి హోమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై, నియోజకర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నారా వెంకటేశం, దేవులపల్లి యాదగిరి, బొడ్డు శ్రీనివాస్, ముస్కురి కృష్ణ, స్వర్గం వెంకటేష్, పెంటయ్య, ఆరిగే శ్రీనివాస్, అంబటి నాగేశ్వర్, గోశిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS