ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్ర

Spread the love

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్,వాంబేకాలాని H బ్లాక్ 1 వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితులుగా;-తెలుగుదేశం పార్టీ యువనాయకులు బొండా సిద్దార్ధ పాల్గొన్నారు

ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ —

నిత్యావసర ధరలు పప్పు, ఉప్పు,  సరుకులు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి అని, తెలుగుదేశం ప్రభుత్వంలో ₹500 రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు ₹1500 వరకు వస్తుందని కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ప్రశ్నించారు,
2019లో ఒక్క ఛాన్స్ అని  అనేకమైన అవాస్తవాలు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు 11నెలలు దాటినా ఈ ప్రజలకు చేసిందేమి లేదు అని ఒకపక్కన ప్రజలు అష్ట కష్టాలు పడి మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ఈరోజు తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందని,
ఎక్కడ చూసిన దోచుకోవడం దాచుకోవడం తప్పా ఈ వైసీపీ నేతలకు ఇంకొకా ధ్యాస లేకుండా పోయింది అని,ఇసుక బకాసురులు రాత్రికి రాత్రులు కనీసం అనుమతులు కూడా లేకుండా ఇసుకను రాష్ట్రాలను దాటిస్తూ కోట్లకు కోట్లు పడగెత్తుతున్నారు
అని అన్నారు….

ఈ కార్యక్రమంలో :- బొండా వంశీ మోహన్, దాసరి దుర్గారావు, దాసరి ఉదయశ్రీ, కోలా దుర్గారావు,ఆకుల సూర్య ప్రకాష్, అమ్మరావు,శివా పార్వతి జనసేన నాయకులు గణేష్, చరణ్, బాలాజీ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page