SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు గారు…

రూ. కోటి నిధులతో బాలుర ఉన్నత పాఠశాలలో పనులు ప్రారంభం అచ్చంపేట: మన ఊరు – మనబడితో పాఠశాలలకు మహార్దశ వచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రూ.కోటి నిధులతో చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణం, డైనింగ్ హాల్, తదితర పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నతమైన చదువు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నారు తెలిపారు. అదేవిధంగా బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి త్వరలోనే అన్ని రకాల సౌకర్యాలతో కొత్త భావనాలను నిర్మించి విద్యార్థినిలకు చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తత్వరగతిన నిర్మాణ పనులను చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసి రామ్ నాయక్, మైనార్టీ నాయకులు అమీనోద్దీన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు, కళాశాల లెక్చరర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS