SAKSHITHA NEWS

వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

“జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి”.. అని కోరుకుంటున్న ప్రజలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

జగనన్నను నేరుగా ఎదుర్కొనలేకే.. పొత్తుల కోసం పాకలాడుతున్న ప్రతిపక్షాలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు సైతం మేలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని, అన్ని వర్గాల ..అన్ని రంగాల ప్రజలకు మంచి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి థ్యేయమన్నారు. కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు జగనే కావాలి మళ్లీ జగనే రావాలి అని కోరుకుంటున్నారని.. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. జగనన్నను నేరుగా ఎదుర్కొనలేక తెలుగుదేశం, జనసేన, ఇతర ప్రతిపక్షాలన్నీ ఏకమై పొత్తుల కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చిన జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుస్తారని.. ప్రజల ఆశీస్సులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 30 At 10.30.23 Am

SAKSHITHA NEWS