SAKSHITHA NEWS

గొట్టుముక్కల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

జగనన్న నవరత్నాలతో ప్రతి ఇంట సంతోషం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామం లో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి.. అని గత పాలకుల మాదిరిగా మాటల్లో చెప్పకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతల్లో చూపుతున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందజేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యపాలనను సాకారం చేస్తూన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలనతో యావత్తు దేశం రాష్ట్రం వైపు చూస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన తీరును – సంక్షేమ పాలనను దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ముఖ్యమంత్రులు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు “గడపగడపకు మన ప్రభుత్వం”, “జగనన్న కు చెబుదాం”, “జగనన్న సురక్ష” అనే కార్యక్రమాలకు ఆలోచన చేసి.. అద్భుత రీతిలో అమలు చేశారని, ప్రజల్లో వై.యస్. జగన్ కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, వైయస్ జగన్ పై తప్పుడు ప్రచారాలతో బురదచల్లేందుకు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఇతర పార్టీల వారితో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 25 At 6.16.30 Pm

SAKSHITHA NEWS