ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం”

Spread the love

ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

పార్టీలకు అతీతంగా అన్ని కుటుంబాలకు మేలు చేశాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఇంటి ముందుకే ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

చందర్లపాడు మండలంలోని “ఏటూరు” గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు అందజేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలమని, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ రారాజుగా సీఎం జగనన్న ఖ్యాతి గడించారని తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగనన్న ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయకుండా నిలువునా మోసం చేశాడని, ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రబల శక్తిగా మారిందని, ఏ కూటమితో తమకు పని లేదన్నారు. అన్ని వర్గాలను సమదృష్టితో చూడటంతో అందరి ఆదరాభిమానాలు జగన్ ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. టిడిపి పాలనలో పక్కా గృహాలు- పింఛను మంజూరు కావాలంటే ఏళ్ళ కొద్దీ అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేదని, నేడు జగనన్న పాలనలో వాలంటీర్లే ఇళ్ల వద్దకు వచ్చి పథకాల ప్రయోజనాలు వివరించి దరఖాస్తు చేస్తున్నారని, జగనన్న పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page