SAKSHITHA NEWS

తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళమిస్తున్నా’ అని తెలిపారు


SAKSHITHA NEWS