SAKSHITHA NEWS

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి నూతన డ్రైనేజీ లైన్ నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం జరిగిందని, ఇంకాకొంచం పని పెండింగులో ఉందని అదికూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అలాగే బస్తి వాసుల కోరిన విధంగా పది మీటర్ల లైన్ పొడిగించి కలపాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, వాసుదేవరావు, గురునాధం, వెంకటకృష్ణ, యాదయ్య, పద్మ, అండాలు, బాబులాల్, గోపాల్, కాశప్పా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS