SAKSHITHA NEWS

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కి స్వచ్చ సర్వేక్షన్ 2023 లో భాగంగా జాతీయస్థాయిలో అవార్డ్ రావడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో జరిగిన పోటీలలో తిరుపతి జాతీయస్థాయిలో అవార్డు పొందిందని, ఈ నెల 11వ తేది డిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డ్ అందుకోవడం జరుగుతుందన్నారు. ఈ అవార్డ్ రావడానికి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజల సహకారం ఎంతో ఉపయోగ పడిందని, మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది పని తీరు వలన, ఇంకో వైపు కౌన్సిల్ సహకారం వలన, అదేవిధంగా నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారుల సహకారంతో ముందుకు వెల్లడం జరిగిందని, వీరందరికి ప్రత్యేక అభినందనలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.

Whatsapp Image 2024 01 05 At 4.18.15 Pm

SAKSHITHA NEWS