నందికొట్కూరు మండల స్థాయి స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ప్రారంభం.

Spread the love

నందికొట్కూరు:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజినవేముల నందు నందికొట్కూరు మండల స్థాయి పాఠశాలల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 మరియు 14 బాల, బాలికల 9 క్రీడలకు సంబంధించిన సెలెక్షన్స్ ను ఘనంగా ప్రారంభించారు.

బిజినేముల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్న లక్ష్మి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ నందికొట్కూరు మండలం ఎం.పీ.పీ. మురళీమోహన్ రెడ్డి , బిజినవేముల సర్పంచ్ రవి యాదవ్ , జడ్పిటిసి సభ్యురాలు కలిమున్నిస , వైఎస్సార్సీపీ నాయకులు పబ్బతి రవి కుమార్ ,మండల తహసీల్దారు శ్రీ రాజశేఖర్ బాబు , మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి ఫైజున్నిస బేగం , నంద్యాల జిల్లా శాప్ కో- ఆర్డినేటర్ రవికుమార్ , నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ శ్రీనాథ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. సెలక్షన్స్ లో మండల పరిధిలోని పాఠశాలల నుండి దాదాపు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ సెలక్షన్స్ లో పాల్గొన్నారు.

ఈ సెలక్షన్స్ కార్యక్రమంలో నందికొట్కూరు యస్.జి.యఫ్ కో -ఆర్డినేటర్ వీరన్న మండలం లోని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సుంకన్న, పద్మలత,రాగన్న,భాస్కర్ రెడ్డి, సుబ్బన్న, శ్రీనివాసులు, గోకారి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page