SAKSHITHA NEWS

ముదిరాజ్ సంఘ భవనానికి ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


సాక్షిత : జిన్నారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ముదిరాజ్ సంఘ భవనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో రూ.5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను సోమవారం స్థానిక నాయకుల సమక్షంలో ముదిరాజ్ సంఘ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కొరకు ఇంకా ఎటువంటి అవసరం ఉన్న సహకారం అందిస్తానని.భవనంలోకి అవసరమైన ఫర్నిచర్ ను అందజేస్తానని ముదిరాజ్ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి ఉప సర్పంచ్ సంజీవ ముదిరాజ్, ముదిరాజ్ సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్,ఉప సర్పంచ్ సంజీవ,మండల అధ్యక్షుడు రాజేష్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, చిటుకుల వెంకటేష్,గాండ్ల శ్రీనివాస్,మత్స్య శాఖ అధ్యక్షుడు నీలం సత్యనారాయణ, ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కావాలి శేఖర్,సంఘ పెద్దలు నీలం నర్సింలు, పుట్టి వీరస్వామి, పుట్టి వెంకటేష్,నీలం వెంకటేష్,సత్యనారాయణ,పుట్టి అశోక్,పుట్టి మహేష్,దోమడుగు శంకర్,నీలం రాము, నర్సింగ్ రావు,వినోద్,బాల రాజ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS