SAKSHITHA NEWS

మునుగోడు సాక్షిత ప్రతినిధి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షణాల్లోనే స్పందిస్తూ అక్కునచేర్చుకుని ఆదరిస్తూ
నేనున్నాను అధైర్యపడొద్దని బాసటగా నిలుస్తున్నారు.
ఈక్రమంలోనే నల్గొండ జిల్లాకు చెందిన వంటెపాక మహేందర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన మహేందర్ ఈనెల 10న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చిన్న వయసులోనే మహేందర్ చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు వైభవ్ దీక్షిత్ ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రస్తుత అవసరాల కోసం 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మహేందర్ సోదరుడు రవివర్మకు 50వేల రూపాయల నగదును అందజేశారు. ఎంపీ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS