SAKSHITHA NEWS

అంగన్వాడీ కేంద్రంను సందర్శించిన ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామ పంచాయతీ లోని ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహిస్తున్న సందర్బంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ cdpo రోజారని సూపర్వైజర్ విజయలక్ష్మి అంగన్వాడీ సెంటర్ ను ఓపెన్ చేసి, అంగన్వాడి కేంద్రంలో ఉన్న స్టాక్ మొత్తాన్ని పంచాయితీ కార్యదర్శి పర్యవేక్షణలో తనిఖీ చేసి పంచనామా చేస్తున్నారని తెలియజేయటంతో,ఎంపీపీ జల్లిపల్లి.

శ్రీరామమూర్తి గారు వెళ్ళి పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లను పిల్లలకి అందజేశారు.అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ వస్తుందని, దానిలో భాగంగానే అంగన్వాడీ కార్యకర్తలకు ఒక సారి జీతాలు పెంచటం జరిగిందని,త్వరలోనే మీ డిమాండ్లను తప్పకుండా పరిష్కరిస్తారని,కావున అంగన్వాడీ కార్యకర్తలు మీ సమ్మె విరమించి తిరిగి వీధులలో చేరాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపిడిఒ శ్రీనివాస రావు,cdpo రోజారని, సూపర్వైజర్ విజయలక్ష్మి,ldc శ్రీనివాస రావు, సెక్రటరీ తేజ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS