SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్నే అంకితం చేసిన మహాను భావుడు జయశంకర్ సార్ అని. ఆయన సిద్దాంతాలు నేటికీ ఆదర్శం అని అన్నారు. ఈనాడు తెలంగాణ ప్రజలు అభివృద్ధికి దారి చూపిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి, సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహేద్ షరీఫ్ బాబా, రోణంకి జగన్నాథం, జ్ఞానేశ్వర్, తెరాస రాజు, విష్ణు, సుంకన్న, రామ్ రెడ్డి, రాము, శ్రీనివాస్, మస్తాన్ రెడ్డి, సంజీవరెడ్డి, సుంకన్న, కళ్యాణ్ నాయక్, రమేష్, బద్రు నాయక్, రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, కొండయ్య, యోగి, రాజు, లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS