సన్నబియ్యానికి నిధులు భరిస్తే మోదీ ఫొటో: ఉత్తమ్

Sakshitha news

సన్నబియ్యానికి నిధులు భరిస్తే మోదీ ఫొటో: ఉత్తమ్

తెలంగాణ : స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఉండాలన్న బీజేపీ డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్ స్పందించారు. కేంద్రం కేవలం దొడ్డు బియ్యం మాత్రమే అందిస్తుందని, సన్నబియ్యం పంపిణీకి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తే మోదీ ఫొటోను పరిశీలిస్తామని తెలిపారు. పేదల సంక్షేమానికి సంబంధించిన రేషన్ కార్డుల విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర పథకాలకు కార్డుల్లో వారి ఫొటోలు పెట్టుకోవద్దని తాము చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు.

Scroll to Top