SAKSHITHA NEWS

ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం.

ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా మున్నేరు వాగు ముక్కుకి గురైన వరద బాధితులకు సుమారు 150 మందికి నిత్యవసర వస్తువుల నయాబజార్ స్కూల్ నందు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం తడిసి ముద్దయిన స్కూల్ రికార్డులను , పరిజ్ఞాన పరికరాలను పరిశీలించారు . బొక్కలగడ్డ , రాజీవ గృహకల్ప ప్రాంతాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవిస్తానని అన్నారు . ప్రొఫెసర్ కోదండరాం నిర్వాసితుల తరఫున వచ్చిన సమస్యలను పరిశీలించి లోకల్ కమిషనర్ ఇచ్చే 16,500 కాకుండా అదనంగా నష్టపోయిన వారికి మానవతా దృక్పథంతో మరోరకంగా వారికి సహాయపడాలని ఖమ్మం కమిషనర్ కు సూచించడం జరిగినది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు , ఖమ్మం జిల్లా కన్వీనర్ వి.బాబు , హైదరాబాద్ నగర అధ్యక్షుడు నరసయ్య , మల్లెల రామనాథం , హనుమంత రెడ్డి , జావీద్ , వెంకటేశ్వర్లు , ఖమ్మం జిల్లా నాయకులు జె రవి , సర్దార్ , ఎల్ నరసింహారావు , వి మోహన్ , బి గణేష్ , రాజేందర్ , నాగేందర్రావు , టిఎన్జీవోస్ నాయకులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS