SAKSHITHA NEWS

MLA కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ …

సాక్షిత : 125 – గాజులరామారం డివిజన్ శిరిడి హిల్స్ సంక్షేమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి సిసి రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ మరమ్మతులు వంటి మౌలిక వసతుల కల్పనపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో 90 శాతం పనులు పూర్తి చేశామని, ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయి ఉంటే అతి త్వరలోనే నూతన పనులను చేపట్టి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

ఈ కార్యక్రమంలో షిరిడి హిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు డి. బ్రహ్మ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యబాబు, సంయుక్త కార్యదర్శి వేణుగోపాల చారి, కోశాధికారి జి. బాలకిషన్, సభ్యులు శివ, అంకిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

MLA

SAKSHITHA NEWS