పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు.ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో తమ్మిశెట్టి కొండ,
బత్తుల కోటేశ్వరరావు,
బత్తుల అంకు,
బత్తుల దుర్గాప్రసాద్,
బత్తుల హనుమంతరావు,
అచ్చి పుట్టారావు,
బత్తుల నరసింహారావు,
చల్లా లింగయ్య,
బత్తుల నారాయణ
తదితరులున్నారు.
వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట వాసులుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
Related Posts
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండుగ కార్యక్రమం
SAKSHITHA NEWS గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండుగ కార్యక్రమం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగించింది రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఐదేళ్లలో ఎక్కడా ఒక్క…
ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో…