సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని ఆర్జికె మరియు భూదేవి హిల్స్ లలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం కూకట్ పల్లి, హైదరాబాద్ వారిచే కిశోర బాలికల కోసం ఉచితంగా అందిస్తున్న టైలరింగ్ శిక్షణ తరగతులు, బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిశోర బాలికలకు టైలరింగ్, బ్యూటిషియన్ శిక్షణను ఉచితంగా అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మేనేజర్ లక్ష్మీ కుమారి, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, బాబు గౌడ్, వేణు యాదవ్, పాపిరెడ్డి, బండ మహేందర్, దాస్, శశిధర్, విఠల్, త్రివేణి, సయ్యద్ సాజిద్, మనోజ్, నాగరాజు, అజాం, వెంకటేష్, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…