మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి.

Spread the love

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి.

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివ నేను గూడెంలో మహాలింగేశ్వర స్వామి జాతర ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల కమిటీ చైర్మన్ రేగట్ట మల్లికార్జున్ రెడ్డి,మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నార్కట్ పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సభ్యులు రుద్రవరం పద్మ యాదయ్య, పొన్నం లక్ష్మయ్య వివిధ హోదాలలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page