SAKSHITHA NEWS

సామాన్యుడిలా అందరితో కలిసి చాయ్ తాగిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్థానికులతో కలిసి సమన్యుడిలా చాయ్ తాగారు.
నార్కట్ పల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మార్గ మధ్యలో చిట్యాల లోని కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్న హనుమంతు టీ స్టాల్ వద్ద ఆగి సామాన్యుడిలా స్థానికులతో కలిసి చాయ్ తాగారు. టీ స్టాల్ వద్ద ఉన్న స్థానికలతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. హనుమంతు టీ స్టాల్ ఓనర్ జంపాల యాదయ్య ను పలకరిస్తూ హోటల్ వ్యాపారం ఎలా నడుస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సాధారణ టీ స్టాల్ వద్ద ఆగి చాయ్ తాగడం అక్కడున్న వారితో మాట్లాడటం తో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు


SAKSHITHA NEWS