చేసింది మేమైతే చెప్పుకునేది మీరా చాలా ఆశ్చర్యంగా ఉంది
సాక్షిత : కోవూరు మండల వైసీపీ నాయకులు
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారం చేపట్టిన తర్వాత పేద కుటుంబాల సొంతింటి ఇంటి కల నెరవేర్చే భాగంలో సుమారు 100 ఎకరాలు పైన కొనుగోలు చేసి కోవూరు మండల ప్రజలకి ప్రసన్నకుమార్ రెడ్డి సొంతింటి కలని నెరవేర్చారు ఇంచుమించుగా 6 వేలు ఇళ్ల పట్టాల పైనే అర్హులు అయినఅందరికీ పంపిణీ చేసి వారి సొంతింటి కలని నెరవేర్చే భాగంలో దాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి జిల్లా అధికారి డిపిఓ ధనలక్ష్మి చేతుల మీదగా పడుగు పాడులో ఉండే స్టవ్ బిడి కాలనీ అనుసంధానమైన 172 ఇల్లు పట్టాలను ఇవ్వడం జరిగింది. కొద్దిరోజుల తర్వాత జిల్లా కలెక్టర్ చేత శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. పనులన్నీ చకచకా చేసుకొని స్మార్ట్ సిటీ టైపులో ఈ ఏరియాని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు.. 2020 – 23 లో అన్ని సదుపాయాలతో దీన్ని మేము పూర్తి చేసి వారికి ఇస్తే నిన్నటి రోజున ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో సెంటు భూమి కూడా కొనకుండా తెలుగుదేశం నాయకులు, అధికారులు, నివాసముంటున్న వారికే తాళాలు ఇవ్వడం జరిగింది స్థానిక ప్రజలు ఆశ్చర్యకరంగా ఉన్నారు.. మేము చేసింది మీరు చెప్పుకోవడం సబబు కాదు మీరు చేసింది మీరు చెప్పుకుంటే ప్రజల హర్షిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలియజేశారు. మా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి చేశాం అని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా యాక్టివిటీ విభాగ కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, వైసిపి రాష్ట్ర వాలంటరీ విభాగ ప్రధాన కార్యదర్శి కాటంరెడ్డి దినేష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్. అహ్మద్, జెట్టి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇంటి లిజ్యవల్ విభాగ కార్యదర్శి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు గాజుల మల్లికార్జునరావు, జానా వెంకటేశ్వర్లు గౌడ్, కవరగిరి ప్రసాద్, మరియు స్థానికులు ఉన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
