SAKSHITHA NEWS

జీఎస్టీ ప్రొఫెషనల్ అసోసియేషన్ సభ్యులు వరద బాధితులకు సహాయం.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం జిల్లా జిఎస్టి ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యులు విరాళాలు సేకరించి ఖమ్మం లో వరద బాధితులకు నిత్యావసర సరుకలు, దుప్పట్లు, ఆహారం పంపిణీ చేశారు. ధంసలపురం కాలానిలో బియ్యం, నూనె, ఉప్పు పప్పులు మొదలైన నిత్యావసర సరుకులు కిట్స్, ఆహారం 120 మంది బాధితులకు అందజేశారు, ఎఫ్ సి ఐ బైపాస్ రోడ్డు ఏరియాలో 500 ఆహారం ప్యాకేట్లు పంపిణీ చేశారు, కరుణగిరి ఏరియాలో రాజీవ్ గృహకల్ప గ్రౌండ్ ఫ్లోర్, పరిసర ప్రాంతాల్లో మునకకు గురైన బాధితులకు 400 దుప్పట్లు పంపిణీ చేశారు. ఇటువంటి ప్రకృతి విపత్తు సమయంలో చేయూత అందించడానికి అసోసియేషన్ సభ్యులు అందరు, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి వరదల్లో అల్లకల్లోలమైనటువంటి కుటుంబాలకు ఆపద సమయంలో అండగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం కే.రామకృష్ణ, బి దుర్గాప్రసాద్ రావు,పవన్ కుమార్, వి సైదులు, జి రమేష్, ఏ రమేష్ బాబు, అనుగుల శ్రీనివాస్, , మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, వెంకట్,అహ్మద్ ఇతర కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS