SAKSHITHA NEWS

పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్*

శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మెగాస్టార్ ఫ్యామిలీ

తిరుమల తెల్లవారుజామున సుప్రభాత సేవా సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు.దర్శనానంతరం శ్రీవేంకటేశ్వరుని రంగనాయక మండపంలో TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో మెగాస్టార్కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరు మల శ్రీ వేంకటేశ్వరస్వా మిని దర్శించుకున్నారు.
గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవ అయిన సుప్రబాత సేవలతో కుటుంబ సభ్యులతో కలిసి ముక్కులు చెల్లించుకు న్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో వేదపండితులు వేదా శీర్వచనం అందించారు.


ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అంద జేశారు. చిరంజీవిని పట్టు వస్త్రాలతో వేదపండితులు సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్బంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. చిరంజీవితో కలిసి ఆయన సతీమణి సురేఖ, మనవ రాలు స్వామివారిని దర్శించుకున్నారు.
బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమల లోని ఫీనిక్స్ అతిథి గ్రుహం లో బస చేసి ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించు కున్నారు.

మూడు తరాలను మెప్పించిన నటుడు మెగాస్టార్ చిరంజీవి..!!!

మూడు తరాలను మెప్పించిన నటుడు
చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాయి వేరు..
మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ‘స్వయంకృషి’తో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలతో పోటీ పడిన ఏకైన నటుడు ఆయనే.
మూడు తరాల అభిమా నులను సంపాదించిన నటుడు కూడా ఈయనే. మెగా ప్రస్థానంలో చిరంజీవి నటన, డాన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్..

WhatsApp Image 2024 08 22 at 12.18.24

SAKSHITHA NEWS