SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డితో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం అంతాయపల్లిలో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఈనెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పర్యవేక్షించారు. కలెక్టరేట్ సముదాయం, సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS