![vangaveeti వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా 1 WhatsApp Image 2024 07 04 at 16.22.39](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-16.22.39.jpeg)
vangaveeti వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా…
సాక్షిత : పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 79 వార్డు లంకెలపాలెం జంక్షన్ లో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన వంగవీటి మోహనరంగాను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదని, రాష్ట్రంలో ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఆయన విగ్రహాలు ఆవిష్కరణ చేస్తూనే ఉన్నారన్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వంగవీటి మోహన రంగా చిరస్మరణీయులు అన్నారు.
ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కె. వాసుదేవరావు, బిజెపి నాయకుడు బంతికోరు గోవిందరాజు,రాఘవా పురపు శ్రీనివాస్ కుమార్, గొల్లవిల్లి నానాజీ, సంపంగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![vangaveeti వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా 2 vangaveeti](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-16.22.39-1024x576.jpeg)