చందానగర్ డివిజన్ పరిధిలోని GSM మాల్ లో గల మధుర బంకేట్ హాల్

చందానగర్ డివిజన్ పరిధిలోని GSM మాల్ లో గల మధుర బంకేట్ హాల్

SAKSHITHA NEWS

Mathura Banquet Hall in GSM Mall under Chandanagar Division

చందానగర్ డివిజన్ పరిధిలోని GSM మాల్ లో గల మధుర బంకేట్ హాల్ లో పటాన్ చెరువు ,శేరిలింగంపల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు కమ్మసంఘం సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే , కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది అని, ఆయన మరణం చాలా బాధాకరమని. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

జీవితంలో ఎన్నిఒడిదోడుకులు ఎదురైన తాను ఎంచుకున్న ప్రతి రంగంలో విజయం సాధించిన పద్మ విభూషన్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీ రావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే తన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన ఘనత రామోజీరావు గారికే దక్కుతుంది అని, దేశానికి అన్నం పెట్టే రైతులకు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటూ వారికి సలహాలు ఇచ్చేందుకు అన్నదాత పత్రిక ను స్థాపించి కోట్లాది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రామోజీ ఫిలిం సిటీ ని నిర్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.

తెలుగు మీడియా రంగంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నరు రామోజీ రావు . ఈనాడు దినపత్రిక ద్వారా తన కలంతో ఒక సమాజాన్ని ప్రభావితం చేసిన ఆయన ఇక లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. తన లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారు. తెలుగు మీడియా రంగంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించారు రామోజీ రావు గారు. ఆయన మన మధ్యన ఇక లేరు అన్న వార్త నన్ను ఎంతగానో బాధించింది. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి రామోజీ రావు అని.

తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం.

అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారు

ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు అని. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారు అని

తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పది.

జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి గొప్పది. సమాజ సేవ చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారు.

కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు పై చదువుల సహయార్థం చెక్కులను పంపిణీ చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు బండి రమేష్, పఠాన్ చెరువు కమ్మసంఘం అధ్యక్షులు తాళ్లూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొల్లి వెంకటేశ్వర రావు, కోశాధికారి పాపారావు , మరియు విజేత సూపర్ మార్కెట్ ఎండి జగన్మోహన్ రావు , సుబ్బారావు, అడపా రామారావు, రాఘవేంద్రరావు, నరేంద్ర ప్రసాద్ , సూర్యనారాయణ,ప్రసాద్, మండవ వేణు, బాలకృష్ణ ,చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS