ఏప్రిల్ ఒకటిన దేశవ్యాప్తంగా బ్లాక్ డే విజయవంతం చేయండి….
ఏఐటీయూసీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కడారి సునీల్ పిలుపు….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: దేశవ్యాప్తంగా కార్మికులకు ఉద్యోగులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లు, బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంట్లో బిల్లు చేసి పారిశ్రామికవేత్తలకు లాభదాయకంగా మారుస్తున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు ఏప్రిల్ 1న. దేశవ్యాప్తంగా బ్లాక్ డే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంల ముందు, పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమాలు బ్లాక్ బ్యాడ్జిలు పెట్టి తెలియజేయాలని, ఏఐటియుసి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కడారి సునీల్ పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY