ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్
రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని BRS శ్రేణులను పార్టీ చీఫ్ కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ పార్టీని వీడినవారి గురించి బాధలేదు. నాడైనా.. నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ తయారు చేస్తుంది’ అని అన్నారు.
![ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్ kcr brs 2 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-19.17.04.jpeg)