SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద పలువురు నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. జన విజ్ఞాన వేదికకు సంబంధించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని ఐదవ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. సూరారం డివిజన్ కు చెందిన నాయకులు స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడతానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS