SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా

గంజాయి విక్రయించే ముఠాపై కూచిపూడి ఎస్ఐ సందీప్ మెరుపుదాడి..

ఐదుగురు విక్రేతలు, ముగ్గురు గంజాయి సేవించేవారు అరెస్ట్..

వారి వద్దనుండి 8 కిలోల గంజాయి స్వాధీనం..

ఎస్ ఐ సందీప్ మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ జాషువా..

కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతను పెడదారి పెట్టిస్తూ, యువతను గంజాయికి అలవాటు చేస్తున్న ఐదుగురు యువకులను కూచిపూడి ఎస్ ఐ డి. సందీప్ తన సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు..

జిల్లా ఎస్పీ పి.జాషువా ఆదేశాల మేరకు, గుడివాడ డిఎస్పీ ఎన్. సత్యానందం ఆధ్వర్యంలో, పామర్రు సిఐ వెంకటనారాయణ సారధ్యంలో గంజాయి తరలించే వారిపై ఎప్పటినుండో నిఘా పెట్టి, సరైన సమయం కోసం వేచి చూస్తూ, నేడు వారిని రెడ్ హ్యాండెడ్ గా కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యంకి అడ్డరోడ్డు వద్ద పట్టుకున్నారు.

అంతేకాక సమీపంలోనే గంజాయికి అలవాటు పడి, గంజాయిని సేవిస్తున్న మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వారిని డి-అడిక్షన్ సెంటర్ కి తరలిస్తామని తెలిపారు


SAKSHITHA NEWS