SAKSHITHA NEWS

బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందిచటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపిటిసి కృష్ణ

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తిదారుల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుండడం పట్ల చిట్యాల కు చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎద్దులపురి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కుల వృత్తిదారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం సంతోషదాయకం అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి బీసీ కులాలకు చెందిన వారందరూ ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. దేశ ప్రధాని బిసి వ్యక్తి అయినప్పటికీ బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే కేంద్రం బిసి కుల గణనను చేపట్టి వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందించాలని కృష్ణ డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS