గురు పౌర్ణిమ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
గురు పౌర్ణిమ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో, ముఖ్యంగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, శాంతి, సుభిక్షాలు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

