మానవత్వం చాటుకున్న మార్కాపురం జర్నలిస్టులు

Spread the love

మానవత్వం చాటుకున్న మార్కాపురం జర్నలిస్టులు
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సహచర జర్నలిస్టుకు 68 వేల ఆర్థిక సాయం అందజేత…


సాక్షిత : అనారోగ్యంతో బాధపడుతున్న మార్కాపురం M3 న్యూస్ విలేకరి మునీర్ కు మార్కాపురంకు చెందిన విలేకరులు అండగా నిలిచారు. గుండెకు సంబంధించి వాల్వు బ్లాక్ అయినందున చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని వైద్యశాలకు వెళ్తున్న విషయం తెలుసుకుని ప్రెస్,క్లబ్ తరుపున 30 వేల రూపాయలను అందించడం జరిగింది. మార్కాపురంలోని జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ పే ద్వారా 33 వేల రూపాయలను పంపారు.

అంతేకాక ఈ విషయం యూనియన్ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్న పెద్దలు, ఏపీయూడబ్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారు 5 వేల రూపాయలను స్థానిక ప్రతినిధుల ద్వారా మునీర్ కు అందించారు. మొత్తంగా 68 వేల రూపాయలను మునీర్ కు అందించడం జరిగింది. ఒక జర్నలిస్ట్ మిత్రుడు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని సాటి జర్నలిస్టులు ఆర్థికంగా ఆదుకోవడం శుభపరిణామమని ప్రెస్,క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.మోహన్ రెడ్డి, వి.వెంకటేశ్వరరెడ్డిలు అన్నారు. చేయుతనందించిన ప్రతి జర్నలిస్ట్ మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్,క్లబ్ గౌరవాధ్యక్షులు కె.రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఓబయ్య, నారాయణరెడ్డి, కోశాధికారి గిరి, సభ్యులు ప్రకాష్, అన్వర్, షఫీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page