SAKSHITHA NEWS

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి. ఆంజనేయులు గురువారం విలేకరుల సమావేశాం నిర్వహించారు.

ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ

పచ్చని కాపురాల్లో కల్తీ మద్యం చిచ్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని, వైసీపీ మ్యానిఫెస్ట్ లో అంచెలెంచలుగా మద్యపానం నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే మూడు రెట్లు రేట్లు పెంచి 41 వేళ కోట్లు దోచేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల ఓట్లు పొంది, జగన్ బినామీలు తయారు చేస్తున్న కల్తీ, నాసిరకం మద్యం వలన యువత ఆరోగ్యం క్షీణీస్తోందని, ఇప్పుడు అదే మద్యంతో పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చేయడం కోసమే ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం లేదని, మద్యం అమ్మకం పై సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. AP మద్యం బ్రాండ్లు హానికరమని ఇతర రాష్ట్రాలు బ్యాన్ చేశారన్నారు. రాష్ట్రంలో గనులు, ఇసుక, మద్యం దోపిడీలలో రాష్ట్రం ముందుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం దారు నాయక్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, మైనారిటీ నాయకులు మాబు తదితర నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS