SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పుల్లల చెరువు (మండల )

పుల్లలచెరువు మండలంలోని ఐటివరం గ్రామంలోని ఎస్సీ పాలెం లో దాదాపు 400 కుటుంబాలు పైగా నివాసం ఉంటున్నారు…. ఇక్కడ ప్రధానమైన సమస్య గత 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల కాలపరిమితి చెల్లిపోయి పదేళ్లు కావస్తుందని… తీవ్రమైన గాలి ప్రవాహానికి … వర్షాభావ పరిస్థితులకి…. ఈ తీగలు తెగిపడే ప్రమాదం ఉందని…. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయని….. ఈ విషయ మై ఉన్నతాధికారులకి ఎప్పటినుంచో తెలియజేసినప్పటికీ… అప్పటికి ఏదో ఒక మాటలు చెప్పి… కాలం వెళ్లబోస్తున్నారని…. ఇప్పటికైనా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని… చూపించాలని…. పాలెం వాసులు కోరుతున్నారు…. ఇంకా చెప్పాలంటే రోడ్డుకు ఇరువైపులా సరైన విద్యుత్ దీపాలు లేవని…వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


SAKSHITHA NEWS