SAKSHITHA NEWS

తాడేపల్లి

వైఎస్ఆర్ సిపిలో చేరిన బిజెపి నాయకులు

పార్టీలోకి ఆహ్వానించిన ఎంపి విజయసాయిరెడ్డి,ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

గుంటూరు జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు మద్దుల రాజా యాదవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు,బిసి నాయకులు వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో గురువారం తాడేపల్లీలో పార్టీలో చేరారు. వారికి విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిసిల సంక్షేమానికి అన్ని విదాలుగా కృషి చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పని చేయాలని పార్టీలో చేరినట్టు మద్దుల రాజా యాదవ్ తెలిపారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


SAKSHITHA NEWS