SAKSHITHA NEWS

Inspections by Food Task Force officials at Alpha Hotel

ఆల్ఫా హోటల్‌ లో ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

హైదరాబాద్:
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రక్కన ఉన్న ఆల్ఫా హోటల్‌ లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో తేలింది.

పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండి ఫ్రిజ్‌లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నా రని అధికారులు తెలిపారు.

కిచెన్‌లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు.

కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS