SAKSHITHA NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ లో జోనల్ కమిషనర్ శ్రీమతి మమత ,AMOH Dr. మమత ,స్ధానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి జాతీయ జండాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగపలం స్వతంత్ర భారతం అని , మహానియులను స్మరించుకోవడం మన విధి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆగస్ట్ 15 న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ,కార్యకర్తలు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS