SAKSHITHA NEWS

శంకర్‌పల్లి లో వైభవం ఏసీ బ్యాంకట్ హాల్ ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైభవం ఏసి బ్యాంకట్ హాల్ ను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్సీ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ బ్యాంకట్ హాలు ను పుర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

బ్యాంకట్ హాలు యజమానులు పురం గోపికృష్ణ, ముత్తంగి రాజశేఖర్ లను ఎంపీ, ఎమ్మెల్సీ అభినందించారు. హాలు యజమానులు ఎంపీ, ఎమ్మెల్సీలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం, మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు రాజేశ్వర్, కుటుంబ సభ్యులు పురం లక్ష్మీనారాయణ, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, పురం రామకృష్ణ, పురం వంశీకృష్ణ, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS