హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు

Spread the love

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో నిజమైన సెక్యులర్‌ ప్రభుత్వం తెలంగాణేనని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతున్నదని చెప్పారు. పేద ముస్లింలకు ఈ ఏడాది 4.50 లక్షల గిఫ్ట్‌ ప్యాక్‌లు అందజేశామని వెల్లడించారు. విందులో సీఎం కేసీఆర్‌ అనాథ ముస్లిం పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు. విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 13 వేల మందికి ఆహ్వానాలు పంపామని మంత్రులు వివరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page