Whatsapp Image 2024 01 22 At 9.54.48 Am

తొలిపూజ చేసేది ఆయనే..!

SAKSHITHA NEWS

అయోధ్య రాముడికి రామ్ నాధీ సంప్రదాయంలో నిత్యపూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. వైఖానసం, శ్రీవైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్రం ఉన్న విధంగానే ఉత్తరాది వైష్ణవులు రామ్ నాధీ ఆగమరీతి పాటిస్తారు. అయోధ్య రామాలయంలో నిత్య పూజాదికాల్ని నిర్వహించడానికి 3వేల మంది అర్చకుల్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. వారికి వివిధ రకాలైన సంప్రదాయ పరీక్షలు నిర్వహించి వారిలో 20 మందిని పూజల కోసం ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్​లోని సీతాపూర్​కు చెందిన మోహిత్ పాండే అనే అర్చకుడికి రాంలల్లాకు తొలిపూజలు చేసే అవకాశం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే ప్రాణప్రతిష్ఠ క్రతువు జరగనుంది. ఘజియాబాద్​లోని దూదేశ్వర్ వేద విద్యాలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలో మోహిత్ పాండే వేదవిద్యను అభ్యసించారు.

Whatsapp Image 2024 01 22 At 9.54.48 Am

SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field