హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన వెంకటేష్ గౌడ్
కేసీఆర్ కేటీఆర్ ఆదేశాలనుసారం శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్ కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. ఏ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రకృతి వనాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన 8వ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేస్తానని, తమ డివిజన్ కు మంజూరైన అరవై వేల మొక్కలను డివిజన్ లోని అన్ని కాళీ ప్రదేశాలలో నాటి అవి పెరిగే వరకు బాధ్యతగా చేసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, యాదగిరి, రాములుగౌడ్, సంతోష్, రవీందర్, కూర్మయ్య, షేక్ బీబీ, ఆర్.పిలు స్వప్న మరియు పద్మ, లింగస్వామి, బోయా సురేందర్, కె.రాములు, నారాయణ, ఆంజనేయులు, నవీన్ ముదిరాజ్, SFA మల్లేష్, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన వెంకటేష్ గౌడ్ 2 WhatsApp Image 2022 08 04 at 12.29.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-12.29.29-PM.jpeg)