SAKSHITHA NEWS

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసిన గురుకుల మెరిట్ జాబితా అభ్యర్థులు

తెలంగాణ గురుకుల బోర్డు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలలో డిసెన్డింగ్ ఆర్డర్ చేపట్టగా పోవడం వలన పలు నోటిఫికేషన్లకు సంబంధించి పోస్టుల కేడర్ వేరు అయినప్పటికీ పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల కొంతమంది అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగిందని, అట్టి అభ్యర్థులు ఇతర ఉద్యోగాలలో చేరకపోవడం వల్ల దాదాపు 2500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని మిగిలిన పోస్టులకు తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,అభ్యర్థులకు న్యాయం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన గురుకుల మెరిట్ జాబితా అభ్యర్థులు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS