SAKSHITHA NEWS

GUNTUR గండి బాబ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు

.సాక్షిత : విశాఖ జిల్లా పెందుర్తి తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు గండి బాబ్జిని విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో బాబ్జిని కలిసిన గుంటూరు వెంకట నరసింహారావు శాలువాతో సత్కరించి పూల బొకే అందించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టిడిపి ఘన విజయం సాధించడంలో బాబ్జి పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచే గండి బాబ్జి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నప్పటినుండి తామిద్దరం మంచి మిత్రులమని, కలిసి వాలిబాల్ ఆడేవారమని గుర్తు చేశారు. తాను మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిన సమయంలో తామిద్దరం కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. గండి బాబ్జి స్నేహానికి ఎంతో విలువ నిచ్చే వ్యక్తిని కొనియాడారు.

GUNTUR

SAKSHITHA NEWS