SAKSHITHA NEWS

పంచాయతీరాజ్ దినోత్సవాల్లో భాగంగా గ్రామసభ ఏర్పాటు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాల్లో భాగంగా గ్రామ సచివాలయంలో సర్పంచ్ కట్టా శ్రీనివాస్ అధ్యక్షతన 2023-24 ఆర్థిక సంవత్సర కాలమునకుగాను గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం, కృషి ఉండడంతో పంచాయతీరాజ్ దినోత్సవాల్లో భాగంగా గ్రామానికి ఉత్తమ అవార్డులు లభించాయని ఇందులో ప్రధమ అవార్డుగా మౌలిక సదుపాయాలు కల్పన,ద్వితీయ అవార్డుగా చైల్డ్ ఫ్రెండ్లీ,తృతీయ అవార్డుగా గుడ్ గవర్నెన్స్ వంటి ఉత్తమ పంచాయతీ అవార్డులు ఉన్నాయని తెలియజేసి అనంతరం గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై చర్చించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిక్కాల వీరమాత,సొసైటీ అధ్యక్షులు తాడి మెహర్ ఆదిత్య రెడ్డి,ఏఎన్ఎం,ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS