బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

Spread the love

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

‘శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ‘ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సుచిత్ర వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జీహెచ్ఎంసీ & రంగారెడ్డి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ‘ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాల కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చుతుందని అన్నారు. బ్రాహ్మణులకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు, సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ్ శర్మ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ చార్యులు, గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ శర్మ, అయాచితం నటేశ్వర శర్మ, మన తెలంగాణ చీఫ్ ఎడిటర్ రామ్మోహన్ శర్మ, తాండూరి నరేంద్ర చార్యులు, మారుతి సత్యనారాయణ శర్మ, రామలింగేశ్వర శర్మ, గ్రేటర్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page