SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నేత జెమ్మి దేవేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దేవేందర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. జాగ్రత్తలు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, కౌన్సిలర్ డప్పు కిరణ్, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, మురళి యాదవ్,విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్, శంభీపూర్ రాము, ఖదీర్,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS