SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో మలిదశ ఉద్యమకారుడు గుండెబోయిన పర్వతాలు, వెలిమినేడు గ్రామంలో దేశ బోయిన మల్లమ్మ లు మరణించడంతో విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను ఓదార్చి 5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చిట్యాల మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాటం వెంకటేశం, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి, వేలిమినేడు బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్యం, నాయకులు ఏర్పుల పరమేష్, ఆవుల రమేష్, అంశాల సత్యనారాయణ, తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS