SAKSHITHA NEWS

మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి

Jun 26, 2024,

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై మాజీ మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు. దీంతో జర్నలిస్టుతో పాటు కెమెరామ్యాన్ కు గాయాలయ్యాయి. రఘునందన్ దాస్ పై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబీ దాస్ గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా జరిగిందీ ఘటన. దీనిపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.

మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి

SAKSHITHA NEWS